SKLM: గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం నరసన్నపేట పట్టణంలో 12వ వార్డు పరిధిలో రూ. 1.50 కోట్ల నిర్మించిన సిమెంట్ రోడ్లు, ఇంటింటి కుళాయి వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చేసే దిశగా అన్ని విధాల కృషి చేస్తున్నానని అన్నారు.