ELR: ఆంధ్రప్రదేశ్ ఆప్కాబ్కు దేశంలోనే 2వ స్థానం సాధించిన సందర్భంగా ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులుని భీమడోలులో మంగళవారం చింతలపూడి, పోలవరం సొసైటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించాలని కోరారు. అలాగే గోడౌన్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.