అన్నమయ్య: చిన్నమండెంలోని గ్రామ సచివాలయాన్ని సోమవారం రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ సేవలను జాప్యం లేకుండా, నిర్ణీత గడువులోగా, పారదర్శకంగా అందించినప్పుడే ప్రజలకు మనపై నమ్మకం కలుగుతుందన్నారు.