ప్రకాశం: కంభం మండల పరిషత్ కార్యాలయంలో ఓన్ సోర్స్ రెవెన్యూ (OSR)పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించేందుకు స్వీయ ఆదాయ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం అవసరమని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా ఆస్తి పన్ను, మార్కెట్ ఫీజులు, భవన అనుమతులు, నీటి వినియోగ ఛార్జీలు వంటి అంశాలపై వివరాలు అందించారు.