GNTR: తురకపాలెంలో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా సాధారణ స్థితిలో ఉన్నాయని ప్రతిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు అన్నారు. మంగళవారం ఆ ప్రాంతంలో పర్యటన చేసి ప్రాంత పరిస్థితులను పరిశీలించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం, వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.