CTR: పుంగనూరు నాగపాళ్యంలోని ఓవస్త్ర దుకాణంలో ఇద్దరు యువకులు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం దుకాణంలో ఎవరూ లేని సమయంలో ఇద్దరు యువకులు బట్టలను దొంగలించారు. ఎప్పటిలాగే దుకాణం మూసే ముందు అదే రోజు రాత్రి యజమాని సీసీ ఫుటేజ్ పరిశీలించగా.. విషయం వెలుగులోకి వచ్చింది.