NDL: మహిళలు సమాజ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. న్యూ ఢిల్లీలోని సౌత్ అవెన్యూలో లోక్ సభ సభ్యురాలు మంజు శర్మ నివాసంలో నిర్వహించిన రాష్ట్ర సేవికా సమితిలో ఇవ్వాల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మహిళా శక్తి దేశాభివృద్ధికి ఎంతో ముఖ్యమన్నారు. మహిళా చైతన్యం కోసం కలిసికట్టుగా పని చేద్దాం అని ఆమె పిలుపునిచ్చారు.