ATP: కూడేరు ఎస్సీ, ఎస్టీ రైతులు అరటి పంటసాగుకు 30 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందించనుందని హార్టికల్చర్ ఆఫీసర్ యామిని, ఎంపీఈవో జాస్మిన్ బుధవారం తెలిపారు. ఈ మేరకు రెండున్నర ఎకరాలో 4 వేల అరటి మొక్కలను సాగు చేసుకోవాలన్నారు. అనంతరం సాగైన రెండు నెలలకు హార్టికల్చర్ ఆఫీస్ లేదా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే తొలి ఏడాది అరటి పెంపకానికి రూ.42 వేలు ఇస్తామన్నారు.