AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల జిల్లా సూర్యలంకలో పర్యటించనున్నారు. అక్కడ తాటి మొక్కలు నాటి ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం నగరవనంలో జరిగే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొంటారు. తర్వాత అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి.. అమరవీరుల కుటుంబసభ్యులతో సమావేశం కానున్నారు.