కోనసీమ: గతంలో ఎన్నడూ లేని విధంగా మండపేట మునిసిపల్ అధికారులు సిబ్బంది తుపాన్ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నారు. మండపేట టౌన్ హాల్, రావుల పేట డొక్కా సీతమ్మ భవన్లో పునరావాసం కేంద్రాలు ఏర్పాటు చేశారు. కమీషనర్ TV రంగారావు తన ఛాంబర్లో రాత్రి వరకు వున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితి వివరిస్తూ వారి సూచనలు అమలు చేస్తున్నారు.