నంద్యాల: బనగానపల్లె నియోజకవర్గంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల సాగుచేసిన పంటలు దెబ్బతిని పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న పెంగల్ తుఫాను వల్ల కంది, శనగ పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు పొగ మంచు వల్ల సెనగ, కంది పంటలు మరింత దెబ్బతిన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని వారు కోరారు.