ప్రకాశం: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో సన్నబియ్యం అమలు చేయాలని రాష్ట్ర మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ఒంగోలుకు చెందిన రాయపాటి జగదీష్ కోరారు. మంగళవారం తాడేపల్లిలోని మంత్రి చాంబర్లో కలిశారు. కేంద్రం విటమిన్లతో కూడిన బియ్యాన్ని హాస్టల్స్కు అందిస్తుందని, సంక్షేమ హాస్టల్ అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.