GNTR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని APSMDA తెలిపింది. దీని ప్రభావంతో పల్నాడు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం ఉదయానికి ఈ వాయుగుండం ఉత్తరాంధ్ర-ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.