NLR: పొదలకూరు మండలం పులికల్లు పంచాయతీ పర్వతాపురం గ్రామాన్ని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం సందర్శించారు. స్పీల్ వే ద్వారా జలాశయం మిగులు నీటిని బయటకు పంపేందుకు ఆరు హిటాచి వాహనాలతో కాలువ పనులను ప్రారంభించారు. పర్వతాపురం, పులికల్లు, వామిటిపర్తి, ఉసపల్లి, అంకుపల్లి గ్రామాల్లో ప్రజలు, పశువులకు ప్రమాదం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.