CTR: పుంగనూరు శ్రీవిరుపాక్షి మారెమ్మకు శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి పసుపు, కుంకుమ, సింధూరం, గంధం, వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.