TPT: జాతీయ స్థాయి అండర్ – 14 బేస్ బాల్ పోటీలకు చంద్రగిరి పరిధి మంగళంలోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రమ్యశ్రీ, అజిత, తోఫిక్ ఎంపికయ్యారు. దీంతో పాఠశాల HM కేశవులు నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచినందుకు అభినందనలు తెలిపారు.