TPT: సోమవారం తిరుపతి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జరుగనుందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని తెలిపారు. అర్జీలు Meekosam.ap.gov.in లోనూ నమోదు చేసుకోవచ్చు, లేదా 1100 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.