TPT: కుక్కను చంపిన ఇద్దరిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. ఈనెల 6న పెంపుడు కుక్కను చంపారంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేశారు. కుక్క ఎదురింట్లో ఉన్న తమను చూసి అరుస్తూ ఉండడంతో సాయికుమార్, శివకుమార్ నరికి చంపినట్లు తెలిపారు.