KKD: నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు ప్రజల రక్షణకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఢిల్లీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు, ఢిల్లీలోని ఏపీ భవన్లో ఒక అత్యవసర కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయించి అక్కడి నుంచి సానా సతీష్ బాబు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ కంట్రోల్ సెల్ సమాచారం ప్రకారం, మొత్తం 217 మంది ఆంధ్రులు నేపాల్లో ఉన్నారు.