KDP: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఈ నెలాఖరులోపు వడ్డీ లేకుండా అన్ని రకాల పన్నులు చెల్లించవచ్చని మున్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పన్ను బకాయిదారులు అన్ని సచివాలయాల్లో, యూపీఐ ద్వారా కూడా పనులను చెల్లించవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.