గుంటూరు: విదేశీ పర్యటనలు చేసి వచ్చిన అర్చకులు దేవాలయ గర్భాలయంలో పూజలు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. శృంగేరి శారదా పీఠం మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారు ఆలయం వెలుపల మాత్రమే పూజలు నిర్వహించాలి. ఈ నిబంధనల అమలు బాధ్యత దేవాదాయ శాఖపై ఉందని కోర్టు పేర్కొంది.