CTR: మెప్మా ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు పాత మున్సిపల్ కార్యాలయంలో లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మంజునాథ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. పీఎం స్వనిధి కింద కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.