ELR: జీలుగుమిల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని శనివారం రాత్రి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిశీలించారు. సదరు వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. అలాగే మెనూ ప్రకారం విద్యార్ధులకు పెడుతున్న భోజన నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.