ELR: ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాలయాలు, ఇతర కార్యక్రమాల్లో బాణాసంచా కాల్చడంపై నిషేధం ఉందని నిడమర్రు ఎస్సై రమేశ్ స్పష్టం చేశారు. పెద నిండ్రకొలనులో జరిగే శ్రీ భీమేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో, ముఖ్యంగా భీమగుండం చెరువు వద్ద నిర్వహించే తెప్పోత్సవంలో ఎలాంటి టపాసులు పేల్చరాదని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించరాదని, ఈ విషయంలో ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలన్నారు.