VZM: గజపతినగరంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మండల మహాసభలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా సహాయ కార్యదర్శి శిరీష పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య వక్తలు జగదీష్ రవికుమార్లు మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిందన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేయగా కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించడం జరిగిందన్నారు.