సత్యసాయి: ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీలో చోరీకి ప్రయత్నించిన దొంగ మృతి చెందాడు. బళ్లారికి చెందిన నారాయణస్వామి మరో ఇద్దరితో కలిసి తాళం వేసిన ఇంట్లోకి చొరబడగా, స్థానికులు వెంబడించారు. పారిపోతూ రైల్వే ట్రాక్ వద్ద కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు.