నెల్లూరు జిల్లాలో వివిధ ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్లుగా విధులు నిర్వహిస్తున్న 17 మందికి మంగళవారం జెడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు అందజేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్ గా పనిచేస్తున్న వారికి పదోన్నతి కల్పించి హైస్కూల్లో రికార్డు అసిస్టెంట్లుగా నియమించినట్లు తెలియజేశారు.