కృష్ణా: ఎమ్మెల్యే యార్లగడ్డ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. శనివారం ఎనికేపాడులో జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేళాలో హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్కు చెందిన ప్రైవేటు కంపెనీలు పాల్గొన్నాయి. నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.