TPT: సత్యవేడు పట్టణంలోని ఇందిరా నగర్లో ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ తగలడంతో ఓ గేదె దూడ మంగళవారం ఉదయం మృతి చెందింది. మేత మేస్తూ అటుగా దూడ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణగా ఏమీ ఏర్పాటు చేయకపోవడంతో దూడ చనిపోయిందని స్థానికులు తెలిపారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.