ASR: డుంబ్రిగూడ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 7వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ ఎంపీడీవో విశ్వనాథ్ బుధవారం తెలిపారు. ఎంపీపీ ఈశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. మండల పరిషత్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన సూచించారు.