KKD: పిఠాపురం నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. పాదగయకు రూ.5 కోట్లు, శ్రీపాద సంస్థానానికి రూ.2 కోట్లు వచ్చాయి. మరో 17 ఆలయాలకు కలిపి మొత్తం రూ.12.75 కోట్లు కేటాయించినట్లు ఈఈ దుర్గేశ్ కుమార్, డీఈ ఉదయ్ కుమార్ తెలిపారు. DY.CM పవన్ కళ్యాణ్ కృషితో వచ్చిన ఈ నిధులకు నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.