TPT: శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న 24 మంది దినసరి కూలీలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక గత 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కోవిడ్ సమయంలో వీరి చేత సేవలు చేసుకొని ఇప్పుడు ఉద్యోగాలు కల్పించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.