కడప: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పలు సచివాలయాల్లో ఈనెల 19వ తేదీ నుంచి ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18న ప్రశాంతినగర్, మున్సిపల్ మాస్టర్ క్యాంపు, 19న పెద్ద కొండప్ప కాలనీ, భాకరాపురం, 20న ఉలిమెల్ల, రాజీవ్ కాలనీ సచివాలయాల ప్రాంతాల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.