VZM: జమ్మూ పడాలపేటలో ఉన్న బేతని మిషన్ చర్చి ఆధ్వర్యంలో క్రీస్తు పునరుత్థాన ర్యాలీ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం పాస్టర్ డా. పాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పడాలపేట, నారాయణపురం, బీసీ కాలనీ, జమ్మూ, ఆనందపురం కాలనీ, సింగపూర్ సిటీ ప్రాంతాల మీదుగా కొనసాగింది. అనేక మంది క్రైస్తవులు ర్యాలీ సందర్భంగా స్తోత్ర గీతాలు పాడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.