ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు రహదారి భద్రత ఉల్లంఘనలపై జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వాహనదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. నిషేధిత వస్తువుల రవాణాను అరికట్టారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు డ్రైవర్లు సీటు బెల్ట్ తప్పనిసరిగా వాడాలని హెచ్చరించారు. పలువురికి జరిమానా విధించారు.