TPT: పుత్తూరు పట్టణంలోని బుధవారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు పుత్తూరు మున్సిపల్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు పుత్తూరు మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్స్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు హాజరవాలన్నారు.