SKLM: శ్రీకాకుళం రెవెన్యూ మండలంలో పని భారం అధికంగా ఉండటం వలన అర్బన్, రూరల్ 2 మండలాలుగా విభజించేందుకు కోరుతూ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ వినతి అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మొగదాలపాడును రెవెన్యూ విలేజ్గా మారుస్తూ మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రికి వినతి సమర్పించారు.