కృష్ణా: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడమే లక్ష్యంగా కొల్లు ఫౌండేషన్ పని చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావు, జనసేన ఇంఛార్జ్ బండి రామకృష్ణతో కలిసి మచిలీపట్నం కోనేరు సెంటర్లో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. వేసవిలో పాదచారుల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.