ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి వారి ఆదివారం ఆదాయం రూ.1,77,735 లు వచ్చినట్లు ఈవో నరసింహ బాబు సోమవారం తెలిపారు. దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ.62,820లు, ప్రసాదం విక్రయం ద్వారా రూ.22,630లు ఆదాయం లభించిందన్నారు. అన్నదానానికి రూ.56,223లు, శ్రీపాద కానుకలకు రూ.25,000లు, స్వామివారి పంచామృత అభిషేకానికి రూ.11,032 ఆదాయం వచ్చిందని చెప్పారు.