కర్నూలు: గోనెగండ్ల మండల పరిధిలోని అలువాల గ్రామంలో రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతుల ఎదుర్కొంటున్న భూ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కుమారస్వామి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భూసమస్యలతో పాటు, ఇనాం భూములు, దేవదాయ, అసైన్డ్ భూముల సమస్యలు ఉంటే అర్జీలు సమర్పించవచ్చన్నారు.