ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో కొలువైన శ్రీ నారాయణ స్వామి సన్నిధిలో ఈనెల 16న మహా పుష్ప యాగం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆలయ ఈవో నరసింహబాబు, ఛైర్మన్ చిన ఆదినారాయణ ఆహ్వానించారు. తప్పక హాజరవుతానని ఎమ్మెల్యే తెలిపారు.