జమ్మూకాశ్మీర్లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో సంభవించిన భారీ పేలుడులో 9 మంది మరణించారు. మరో 31 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు శ్రీనగర్ను సందర్శించే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకుని పీఎస్ లోపల జరిగిన పేలుడు ఘటనపై ఆరా తీయనున్నట్లు తెలిపాయి.