W.G: ఉంగుటూరు మండల సర్వసభ్య సమావేశం ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు జరుగుతుందని ఎంపీడీవో గంజి రాజు మనోజ్ తెలిపారు. మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అధ్యక్షతన జరుగుతుందన్నారు. మండలంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.