ELR: కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధికి సంబంధించిన రూ.27,11,511 చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు నియోజకవర్గంలో రూ.75లక్షలను బాధితులకు అందజేశామన్నారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు ఉన్నారు.