కృష్ణా: కోడూరు మండలం ఉల్లిపాలెం భవానిపురం వీధికి ఇరుపక్కల అప్రోచ్ను తక్షణమే నిర్మించాలని మండల బీజేపీ నాయకులు కోరారు. బుధవారం అవనిగడ్డలో నిర్వహించిన ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్కు వారు వినతిపత్రం అందించారు. వారధి ఎక్కే అప్రోచ్లు పల్లంగా ఉండటం వల్ల వాహనాలు ఎక్కే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.