CTR: జిల్లా తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్సై టీజీ మనోహరన్కు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ తూషార్ డూడి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ₹1 లక్ష తక్షణ సహాయం అందజేశారు. పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.