కృష్ణా: రాబోయే 2,3 రోజుల్లో వచ్చే తుఫాన్ పట్ల కృష్ణాజిల్లా రైతాంగం అప్రమత్తంగా ఉండాలని ఎంపీ బాలశౌరి ఆదివారం కోరారు. తుఫాను తీవ్రత వల్ల గట్లు తెగే అవకాశం ఉందని, డ్రైన్లు పొంగి పొరలుతాయని పంటను రక్షించుకోవడం కోసం రైతులు సదరు సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఎదురైతే తన కార్యాలయానికి సమాచారం ఇవ్వాలన్నారు.