PLD: రొంపిచర్ల మండలంలో సాగునీటి సంఘం ఎన్నికలు శనివారం నిర్వహించారు. తురుమెళ్లకు సంబంధించిన ఎన్నికలను వీరి పట్నంలో నిర్వహించారు. సాగునీటి సంఘం అధ్యక్షుడిగా చిరుమామిళ్ల మల్లికార్జునరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని ఆయన అందుకున్నారు. తన నియామకానికి సహకారం అందించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.