బాపట్లలోని భావనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పలు ముఖ్య సూచనలు చేశారు. బాపట్లకు మూలదైవంగా భావించే భవదేవుడు ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉందన్నారు. సుమారు 1433 సంవత్సరాలుగా స్వామి ఇక్కడ కొలువై భక్తులను దీవిస్తున్నారని పేర్కొన్నారు.