ప్రకాశం: కనిగిరి బీజేపీ కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణయ్య ఆదివారం పామూరు మండలంలో పర్యటించారు. నడికుడి కాళహస్తి రైల్వే లైన్ కనిగిరి-పామూరుకి మధ్యలో జంగిల్ క్లియరెన్స్ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 2027 నాటికి రైల్వే లైన్ పనులు పూర్తవుతాయని ఈ సందర్భంగా తెలిపారు.